Today Telugu News Updates

ప్రేమ పేరుతో దొంగ పెళ్లి చేసుకొని యువతిని మోసం చేసిన ఓ యువకుడు:-

కరీంనగర్ జిల్లా మానకొండూర్ సమీపం లోని చెంజర్ల గ్రామానికి చెందిన రవళి , ఖాదర్ గూడెం గ్రామానికి చెందిన యువకుడు కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు . వీరు ఇరువురు ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నారు .

తన ఫై ఎంతో ప్రేమ చూపించిన యువకుడు ,కొన్ని రోజులనుండి రావళిని దూరం పెడుతూండటం తో , మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గమనించిన యువతీ, తన ఆవేదనని గూడెం గ్రామా పంచాయితీ ముందు తెలిపింది.

గూడెం గ్రామా పెద్దలు తనని మందలించి చెంజర్లకి పంపించారు . రవళి తన ఇంట్లో ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది . కానీ తన తల్లిదండ్రుల మందలింపుతో ,ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

మరుసటిరోజు గూడెం వెళ్లి వాటర్ ట్యాంక్ ఫై ఎక్కి తనకి న్యాయం చేయాలని తన వాదనను వినిపించింది . గూడెంలోని ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో , పోలీసులు తనకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి యువతిని తన గ్రామానికి పంపించారు . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button