Today Telugu News Updates

భార్యను చంపి.. శవాన్ని స్కూటీ మధ్యలో శవాన్ని ఉంచి తీసుకెళ్తూ పట్టుబడ్డ భర్త

నేటి సమాజంలో చిన్న చిన్న కారణాలకే భార్య భర్తలు హత్యలు చేసుకున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు వివాహేతర సంబంధలతో, మరి కొందరు కుటుంబ కలహాలతో హత్యలకు పాల్పడుతున్నారు. అలాంటిదే గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది…ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. రాజ్కోట్ సమీపాన ఉన్న వేరవాల్ గ్రామంలోని సంధ క్యాంపు కాలనీ కి చెందిన భర్త హేమ్నాని, భార్య నైనా దంపతులు నివసిస్తున్నారు. హేమ్నాని ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో పని పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు .

గత కొన్ని రోజులుగా దంపతులిద్దరి మధ్య తరచూ కుటుంబ కలహాల విషయంలో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం కూడా భార్య భర్తలు గొడవ పడగా…ఆ గొడవలో భర్త తీవ్ర ఆగ్రహానికి గురై భార్య నైనాను గొంతు పిసికి దారుణంగా హత్యచేశాడు. భర్త హేమ్నాని హత్య చేసిన భార్య శవాని రోహిషాల ఆవల ఉన్న అడవిలో పడేయలన్నీ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు స్కూటీ మధ్యలో శవాన్ని ఉంచి… అడవిలోకి బయలుదేరాడు. ఈ తరుణంలో కాళ్ళు రోడ్ పై వేలాడుతున్న శవాన్ని చూసి స్థానికులు , స్కూటీని ఆపి నిందితుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టగా తన భార్యని తనే చంపినట్టు హేమ్నాని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు భర్తని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button