ఇంటర్నేషనల్ క్రూయిజెస్లో చెఫ్……ఇపుడు చూస్తే ఫుట్ పాత్ పై బిర్యానీ సెంటర్!
ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పని చేసిన చీఫ్… వీధుల్లో బిర్యానీ బండి పెట్టి రోజుకు లెక్కలేనంత డబ్బులను ఆర్జిస్తున్నారాని అంటే మీరు నమ్ముతారా?…. నిజమండి బాబోయ్… ఇది ఎక్కడో జరగలేదు.. మన ఇండియాలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.. ఇంతకీ అతను ఎవరు? అతను అంత గొప్ప చీఫ్ ఉద్యోగం వదిలేసి బిర్యానీ బండి ఎందుకు పెట్టాడో తెలుసా?? ఇలాంటి ప్రశ్నలకు సమాధానలు తెలియాలంటే… ఆయన కథ పూర్తిగా తెలుసుకోవాలి…
మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై చెందిన అక్షయ్ పార్కర్ తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ ఇంటర్నేషనల్ క్రూయిజెస్లో చెఫ్గా పని చేస్తాడు…కానీ కరోనా దృష్ట్యా లాక్ డౌన్ లో అన్ని రెస్టారెంట్లు బంద్ అవడంతో… జీతాలు ఇవ్వలేక అక్షయ్ ను ఉద్యోగం నుండి తీసేశారు… దీంతో అక్షయ్ ఉపాధి కోల్పోయాడు…తన తల్లిదండ్రులు ఆరోగ్యం బాగా లేకపోవడంతో..వారిని వారికి కావలసిన మందులకు..
ఈ క్లిష్ట పరిస్థితుల్లో డబ్బు ఎలా సంపాదించాలో అక్షయ్ కి అర్థం కాలేదు…కానీ అతని సేవింగ్స్ అకౌంట్లో కేవలం ఇరవై వేలు మాత్రమే ఉన్నాయి… అదే సమయంలో దదుర్ లో వడ పావ్ అమ్మే టీ స్టాల్ వ్యక్తి తన స్టాల్ అమ్ముతనని చెప్పడంతో.. ఆ స్టాల్ ను అక్షయ్ కొనుగోలు చేసి… అందులో వెజ్, నాన్ వెజ్ బిర్యాని వ్యాపారం మొదలు పెట్టాడు… మొదట 10 వేలతో వెజ్, నాన్ వెజ్ బిర్యానీలను ఇంటి వద్ద తయారు చేసుకుని వచ్చి అమ్మేవాడు… ఆ తర్వాత వ్యాపారం పెరుగుతుండడంతో… అక్కడే ఒక పెద్ద షాప్ లాగా ఏర్పాటు చేశాడు… ఈ షాపులో బిర్యానీ రుచిని చూసిన పలువురు ఆహా అని అంటున్నారు.. దీంతో అక్షయ్ బిర్యాని గురించి దదుర్ లో ఆ నోటా ఈ నోటా పాకడంతో… బిర్యానీ ప్రియులు క్యూలు కడుతున్నారు… ఈ క్రమంలో రోజుకి అక్షయ్ బాగానే డబ్బులను సంపాదిస్తున్నాడు…