ధనుర్మాస విశిష్టత
తిరుప్పావై ధనుర్మాసము యొక్క విశిష్టత.
తిరుప్పావై అనగా తిరు అనినశుభమైన.పావై అనిన వ్రతమని అర్ధం.మొత్తం మీద శుభమైన,శుభాలను కలిగించే వ్రతమని అర్ధం.దీన్నే శ్రీవ్రతమని కూడా అంటారు.ఈ వ్రతాన్ని ధనుర్మాస వేళ పాటిస్తారు.ముఖ్యంగా శ్రీ వైష్ణవులు బాగా పాటిస్తారు.విష్ణు ఆలయాల్లో ధనుర్మాస వేళ అద్భుతమైన సేవలు జరుగుతాయి.
ధనుర్మాసమనగా సూర్యుడు తన గమనాన్ని వృశ్చిక రాశి నుండి ధను రాశిలోకి ప్రవేశించడం.దీన్నే సంక్రమణ గా వ్యవహరిస్తారు.ఈ సంక్రమణ కాలం బహు పుణ్య కాలం అని అర్ధం.
విష్ణు మూర్తి అనుగ్రహం కోసం ప్రతిరోజు గోదాదేవి భక్తితో ఆలపించిన తిరుప్పావై అనబడె మూల ద్రావిడభాషలో ఉన్న పాశురాలు అనబడే కీర్తనలు రోజు ఒక్కటి పారాయణ చేయాలి.దీని అర్ధం ను గమనించితే ఆండాళ్ తల్లి ఆ పాశురాల ద్వారా మనకు కర్తవ్య భోధన చేస్తుంది.తిరుమలలో సైతం ఈ మాసం లో సుప్రభాతం కు బదులు ఈ పాశురాలు స్వామి వారి ఎదుట పఠన చేస్తారు అంటే అర్ధం చేసుకోవచ్చని పెద్దల మాట
వీలయితే ఆ పాశురాల అర్ధం తెలుసుకుని తరిద్దాం.
ఓం నమో నారాయణాయ