Tollywood news in telugu
పవన్ కళ్యాణ్ చే ప్రారంభించబడిన ‘గమనం’ ట్రైలర్… శ్రియను చూసి అభిమానుల గుండె బరువెక్కుతుంది !
సుజనా రావు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘గమనం’ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇందులో శ్రీయ,ప్రియాంక జవాల్కర్ , నిత్యామీనన్, ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ ద్వారా సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి, ఈ రోజు పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడంతో ప్రజలకి మరింత చేరువ కానుంది.
గమనం సినిమా యూనిట్ మొత్తం 5 బాషలలో ఈ సినిమాను విడుదల చేయనుంది. ఇందులో చెవిటి యువతిగా చంటిపాప తో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్ కావాలనుకునే ఓ యువకుడిని ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం, ఇలా మూడు కథలతో ఈ ట్రైలర్ ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.