Today Telugu News Updates
GHMC Elections : జీహెచ్ఎంసి ఎన్నికలకు సర్వం సిద్ధం: పార్థసారధి

hyderabad : హైదరాబాద్ పరిధిలో ఎల్లుండి జరగనున్న ఎన్నికలకు సంబందించిన పనులు పూర్తి అయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ పార్థసారధి తెలిపారు.
కమీషనర్ పార్థసారధి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సాయంత్రం ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. గడువు ముగిసాకా ప్రచారం చేస్తే వారికీ జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఈ ఎన్నికలకోసం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని , ఇందులో 1207 సున్నితమైనవి అని మిగితావి క్రిటికల్ కేంద్రాలని తెలిపారు.
ఇందుకు 36 వేయిలకు పైగా సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అదేవిదంగా 18 వేయిలకు పైగా బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశామని మీడియా సమావేశంలో తెలిపారు.