Today Telugu News Updates

అత్యాచారం కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం.. ఎక్కడంటే

అత్యాచారం కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగన్ని ఇచ్చింది మణిపూర్ గవర్నమెంట్. పూర్తి వివరాల్లోకి వెళితే తౌడమ్ జిబల్ సింగ్ అత్యాచారం,హత్య కేసులో 8 సంవత్సరాలగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జిబల్ సింగ్ అత్యాచారం చేశాడనే ఆరోపణలు రావడంతో ప్రజలు తన ఇంటిని కూల్చేశారు. తాజాగా సెషన్సు కోర్టు ఈ కేసులో విచారణ చేపట్టగా తౌడమ్ జిబల్ సింగ్ నిర్దోషి అని విడుదల చేసింది. ఆ తర్వాత జిబల్ సింగ్ మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ ను కలిశారు. చెయ్యని తప్పుకు 8 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినందుకు అటవీశాఖలో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఓ సొంత ఇల్లు కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button