స్వామి కి హయగ్రీవము నివేదన విశిష్టత
ఈరోజు మార్గశిర బహుళ త్రయోదశి యుక్త లక్ష్మి వారం.
ఈరోజు లక్ష్మి వారం యొక్క ప్రత్యేకత ఏమంటే ఈరోజు కొంతమంది మార్గశిర లక్ష్మి వార వ్రతాలు చేస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం నివేదన చేస్తారు. మరొక విశేషం ఈరోజు గురువు ఆధిక్యత గలరోజు కాబట్టి గురువు ఆరాధన లేదా గురు రూపం లో ఉన్న దక్షిణామూర్తిని లేదా హయగ్రీవుని ఆరాధన చేయాలి.
ఈ మాసం విష్ణు మూర్తికి ప్రియమైనది కాబట్టి ఈరోజు విద్యా ప్రదాత, జ్ణాన ప్రదాత, వేదాలను రక్షణ చేసిన విష్ణు స్వరూపం హయగ్రీవుని ఆరాధన చేయాలి. స్వామి మెడ భాగం వరకు అశ్వం రూపంలో మిగిలిన భాగం నరుని రూపంలో ఉంటాడు. ఈ స్వామి ని ఈరోజు ఆరాధన చేసిన తర్వాత నానబెట్టిన సెనగపప్పు ను ఉడకబెట్టి దాంట్లో తగినంత బెల్లం వేసి చేసే మధుర పదార్థం పేరు హయగ్రీవం అంటారు.ఇది నివేదన చేయడం వల్ల విద్యా, కార్య సంబంధ కార్యక్రమాల్లో విజయం పోందుతాము.
ఓం హయగ్రీవాయ నమః