తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్, High court fires on TS govt
కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్యశాఖ సంచాలకుడు ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యకరంగా ఉందని, High court fires on TS govt ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారని తెలంగాణ హైకోర్టు మండిపడింది . రాష్ట్రంలో కరోనా పరీక్షలు , మీడియా బులెటిన్లో అరకొర సమాచారం ఇస్తుండడంపై హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది . తమ ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని హైకోర్టు – ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది .
మీడియా బులెటిన్లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది . రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో చెప్పాలని నిలదీసింది . కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది . గత ఇరవై రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు హైకోర్టుకు వెల్లడించాలని కోరింది . కేంద్ర బృందం పరిశీలనలో ఏయే అంశాలు చేరాయని ఆ వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది . ప్రభుత్వం జీవించే హక్కును కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది . గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది . నివేదికలు సమర్పించకపోతే కోర్టు ధిక్కరణగా భావిస్తామని , ఆర్ ఏడీ బ్లడ్ శాంపిల్స్ ఎందుకు చేయకూడదని , పది నిమిషాల్లో రిజల్ట్ వచ్చే పరీక్షలు చేయాలని గతంలో ఆదేశించిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది .
High court fires on TS govt ::
కరోనా బారిన పడిన వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి మూడు రోజులైనా ఆ పరీక్షలు ఎందుకు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు . 50 వేల టెస్టులు చేస్తామని ప్రకటించి వైద్య పరీక్షలను ఆపివేయడం వెనక అంతర్యమేమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది . ఇప్పటికైనా ఆర్ఎడీ శాంపిల్స్ సేకరించాలని పిటీషనర్ కోర్టును కోరారు . మే 23 నుంచి జూన్ 28 వరకు ఎన్ని టెస్టులు చేశారని ప్రైమరీ , సెకండరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది . జూన్ 26 న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు ఉన్న వారికి , లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది .
ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ఎక్కడెక్కడ పర్యటించిందని , ఈ పర్యటనలో ఏయే అంశాలను వారు అధ్యయనం చేశారని ఆ విషయాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని కోరింది . ఈ వివరాలను ఈనెల 17 న తెలపాలని హైకోర్టు పేర్కొంది . ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని , ఆ విధంగా ప్రభుత్వం వ్యవహరించరాదని హైకోర్టు స్పష్టంచేసింది . ఏప్రిల్ 21 , జూన్ 8 , జూన్ 18 న ఎన్నెన్ని కిట్స్ ఇచ్చారని , దీన్ని కూడా కోర్టు ధిక్కరణ కింద తీసుకుంటున్నామని , 17 వ తేదీ వరకు ఆదేశించిన పనులు పూర్తి చేయకపోతే అధికారులు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది . ఈ కేసు విచారణను ఈనెల 17 వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఆ రోజున ప్రభుత్వం నుంచి సానుకూలస్పందన రాకపోతే జూలై 20 న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ కోర్టుకు హాజరు కావలసి వస్తుందని హెచ్చరింది .