Today Telugu News Updates

ఇద్దరు చిన్నారుల పై వృద్దుడు హత్యాచారం, Horrible incident in Telangana

Horrible incident in Telangana బ్యూరో చాక్లెట్లు ఆశచూపి ముక్కుపచ్చలారని ఇద్దరు బాలికలపై ఓ వృద్ధుడు లైంగికదాడికి పాల్పడగా .. తల్లిని మభ్యపెట్టి , ఆమె కూతుర్ని బెదిరించి వారిపై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అఘాయిత్యానికి పాల్పడ్డారు .

 ఈ ఘటనలు నిజామాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం వెలుగుచూశాయి . నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకం పేటకు చెందిన మచ్కూరి నారాయణ ( 55 ) అదే గ్రామంలోని ఇద్దరు చిన్నారులకు 15 రోజులుగా చాక్లెట్ల ఆశ చూపుతున్నాడు . వారిని స్థానికంగా ఓ పాడుబడ్డ ఇంట్లో తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతూ ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు . ఆదివారం కూడా చిన్నారులను తీసుకెళ్తుండగా ఓ బాధిత బాలిక తల్లి చూసి కాలనీవాసులకు చెప్పడంతో పట్టుకుని దేహశుద్ధి చేశారు .

Horrible incident in Telangana ::

 బోధన్ రూరల్ సిఐ రవీందర్ నాయక్ పూర్తిస్థాయిలో విచారణ జరిపారు . నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి , బాలికలను చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు . రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పటేల్ గూడకు చెందిన గడుసు నర్సింహయాదవ్ ( 50 ) రియల్ ఎస్టేట్ వ్యాపారి . వనస్థలిపురం పరిధిలోని శ్రీనివాసపురం కాలనీలో ఓ మహిళతో పరిచయమై వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు . గత నెల 22 న ఆమె ఇంటికి వెళ్లగా మహిళ కూతురు ( 17 ) ఒంటరిగా కనిపించింది . ఆమెపై లైంగికదాడికి పాల్పడి , ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు . ఇటీవలే బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లి ఆరా తీసి అసలు విషయం తెలుసుకుంది . ఇద్దరు కలిసి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసినట్టు వనస్థలిపురం సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎ.వెంకటయ్య తెలిపారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button