Tollywood news in telugu

కార్తీ “ఖైదీ” అక్టోబర్ 25న విడుదల !!!

కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ బేనర్ పై లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖైదీ’ అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో ఒకేసారి విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

వైవిధ్యమైన చిత్రాలు చేసే కార్తీ నటించిన ఖైదీ చిత్రం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. జీవిత ఖైదిగా ఉన్న ఒక కూతురి తండ్రిగా కార్తీ సినిమాలో కనిపిస్తున్నాడు. అలాగే జైలు నుంచి తప్పించుకొని పోలీస్ ఆఫీసర్ తో అతని ప్రయాణం ఎలా సాగింది అనే పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. సినిమాలో యాక్షన్ డోస్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. విశేష ప్రశంసలు అందుకున్న ‘నగరం’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ ట్రైలర్ లో తన మార్క్ ఎలిమెంట్స్ తో ఆడియెన్స్ లో మంచి హైప్ ని క్రియేట్ చేశాడు. ఇక డైలాగ్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎక్కడికి పోతున్నావ్? ఏం చేస్తున్నావ్ చుట్టూ పాతిక మంది ఉన్నారు అని అనగానే ‘పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే నీకు తెలుసు.. లోపలికి వెళ్లే ముందు ఏం చేసేవాడినో తెలీదు కదా’ అంటూ కార్తీ పలికే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ‘ ఏం సత్తావని భయమేస్తుందా? చావునైనా ఎదిరించి చావాల్సిందే అంటూ కార్తీ చివరలో చెప్పిన ఆ లైన్ స్ట్రాంగ్ గా ఉంది.

ఖైదీ సినిమాను తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button