ఇదేం పనిష్మెంట్ రా బాబు
ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒక ఫోటో హల్చల్ చేస్తుంది.దాన్ని చూసిన నెటిజన్లు కంపెనీ యాజమాన్యం పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.ఉద్యోగం చేస్తున్నందుకు ఇలా అవమానిస్తారా అంటూ నెటిజన్లు ఉద్యోగులకు బదులుగా ప్రశ్నిస్తున్నారు.
అసలేం జరిగిందంటే చైనాలోని ఓ ప్రముఖ కంపెనీ తమ ఉద్యోగులు ఇయర్ ఎండింగ్ టార్గెట్లను పూర్తి చేయలేదని కారణంతో వాళ్లను మోకాళ్లతో,చేతులతో నడిరోడ్డులో నడవమని పనిష్మెంట్ ఇచ్చింది.ఉద్యోగం కాపాడుకోవడం కోసం కంపెనీ విధించిన పనిష్మెంట్ నీ ఉద్యోగస్తులు తూచా తప్పకుండా పాటించారు.ఉద్యోగం మోకాళ్లు చేతులతో నడుస్తున్న వైనం చూసిన అక్కడ కొందరు పోలీసులకు సమాచారం అందించారు .తక్షణమే పోలీసులు అక్కడకు చేరి పనిష్మెంట్ పేరు నా జరుగుతున్న దౌర్జన్యాన్ని నిలువరించారు.కానీ ఈ దారుణాన్ని ఎవరో కెమెరాతో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఆ వీడియోని, ఫోటోలను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఆ కంపెనీ ఉద్యోగుల పట్ల వ్యవహరించిన తీరుపై ఫైర్ అయ్యారు.తక్షణమే ఆ కంపెనీని మూసివేయాలని తమ సలహాలను సైతం ఇచ్చారు.