Today Telugu News Updates

MLC Kavitha: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత…!

మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ పట్టణంలోని కంటేశ్వర మీదుగా వెళుతుండగా… రోడ్డు ప్రక్కన యాక్సిడెంట్ అయ్యి ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో పడి ఉంది. దీంతో కవిత కారులోంచి దిగి.. అంబులెన్స్ కి ఫోన్ చేయించి, ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కరోనా కష్టకాలంలో ఎమ్మెల్సీ కవిత పెద్ద మనసుతో ఎంతోమంది పేద విద్యార్థులకు,ప్రజలకు సాయం అందజేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ లో పలు వివాహ వేడుకలు హాజరయ్యారు. ఆ తర్వాత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు… అనంతరం
బోర్గోన్ లక్ష్మీగణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button