నేటి ముక్కోటి తీర్ధ ద్వాదశి విశేషాలు
ఈరోజు విశిష్టత మార్గశిర శుద్ధ ద్వాదశి.
ఈరోజు చేయాల్సిన విధులు మరియు ఉన్న విశేషాలు తెలుసుకుందామా. ఈరోజు ను కూర్మద్వాదశి అంటారు.ముక్కోటి ఏకాదశి మరుసటి రోజు అయిన ఈరోజు తిరుమలలో ముక్కోటి తీర్ధ ఉత్సవం జరుపుతారు. ఈరోజు అనందనిలయంలో ఉన్న చక్రత్త ఆళ్వార్ ను ప్రదక్షణ పూర్వకంగా తిరుమల మాడవీధుల్లో ఊరేగింపు గా వరహాస్వామి ఆలయం చెంత ఉన్న పుష్కరిణి లో స్నానం చేయిస్తారు.
ఈ సమయంలో స్వామి పుష్కరిణి లో మూడున్నర కోట్ల తీర్ధాలు వచ్చి చేరతాయి. భక్తులు కూడా పుణ్యస్నానాలు చేస్తారు. కేవలం సంవత్సరం లో నాలుగు విశేష పర్వదినాలలో మాత్రమే చక్ర స్నానం నిర్వహిస్తారు తిరుమలలో. స్నానం అనంతరం తిరిగి ప్రదక్షణ దిశగా అంతరాలయ ప్రవేశం చేస్తారు.నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నవారు నేడు ద్వాదశి నాడు ఆ గడియలు దాటకుండానే పారాయణ చేయాలి వీలయినంత అన్న సమారాధనలు చేయాలి. బుధవారంతో కుడి వచ్చింది కాబట్టి పెసలు దానం చేయండి లేదా నానబెట్టి ఆవుకు బెల్లంతో కలిపి నివేదన చేయండి.
ఓం నమో వేంకటేశాయ