వివిధ దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి
ఈరోజు విశేషం వైకుంఠఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారా స్వామి దర్శనానికి వస్తారు.స్వామి వారు గరుడ గమనుడై భూలొకము కేగి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహిస్తాడు.
ఈరోజు ఒక్కో క్షేత్రం లో ఒక్కో రకంగా విశేషమైన సేవలు జరుగుతాయి.
తిరుమలలో ఈరోజు ఉభయదేవేరులతో మలయప్ప స్వామి కి స్వర్ణరథఉత్సవం నిర్వహిస్తారు.భద్రాద్రి రాముడు ఈరోజు వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనం ఇస్తారు.ద్వారక తిరుమల నాథుడు ఈరోజు నిజరూప దర్శనం ఇస్తాడు.
అన్నవర సత్యదేవుని ఈరోజు శయన మూర్తి గా అలంకరణ చేస్తారు.ఒంటిమిట్ట రామాలయం లో ఈరోజు స్వామి గరుడ వాహన ఊరేగింపు ఉంటుంది.శ్రీశైలం కాళహస్తి లో కుడా ముక్కంటిని కూడా ఈరోజు ప్రత్యేక ఉత్తరద్వార దర్శనఏర్పాటుకు సన్నాహాలు చేసారు.ఈరోజు అందరు నారాయణ దర్శనం ఉత్తర ద్వారము ద్వారా చేయండి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
ఓం నమో నారాయణాయ