వరంగల్ నడిబొడ్డున రెచ్చిపోయిన సైకో శంకర్ !

వరంగల్ జిల్లాలోని కరీమాబాద్కు చెందిన శంకర్.. వ్యక్తిగత కక్షల కారణంగా తన మేన కోడలితో పాటు, ఆమె స్నేహితుల ఫోటోలను అసభ్యంగా మార్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ ఫోటోలను గుర్తించిన బాధితులు శంకర్ ని మందలించారు. ఐనకాని తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఆ సైకో ఆగడాలు ఇంకా ఎక్కువ కావడంతో పాటు ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సప్ స్టేటస్, ఫేస్బుక్ లలో అసభ్య పదజాలాలతో ప్రచారం చేశాడు.
ఇలా చేయడం వల్ల బాధితురాలి పెళ్లికి అడ్డుపడాలని చూస్తున్నాడని బాధితులు పోలీసులకు తెలిపారు. ఆ సైకో శంకర్ నుండి తమను ఎలాగైనా కాపాడాలని ఆలా కాపాడకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆవేదన వెల్లడించారు. పోలీసులు శంకర్ ని పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.