telugu gods devotional information in telugu

నిన్న జరిగిన పుష్పయాగం విశిష్టత

 

శ్రీవారికి జరిపిన పుష్ప యాగ విశేషాలు.

తిరుమలలో శ్రీవారికి ఏటా కార్తీక మాసంలో జరిగే అపురూపం అయిన ఉత్సవం పుష్ప యాగం.ఇది కార్తీక మాసం లో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేస్తారు.

ఈ క్రతువు శ్రవణ నక్షత్రం ఉన్న ముందు రోజు నుండే మొదలు అవుతుంది.కంకణ ధారులైన ఆచార్యులు మలయప్ప స్వామి వారిని నిత్య పూజల అనంతరం వేంచేపు చేసి పాలు, పెరుగు , తేనె , నెయ్యి , నారికేళ జలం , పసుపు , చందనం , కుంకుమ పూవు , వట్టి వేర్లు కలసిన సుగంధ పరిమళ జలాలతో అభిషేకం చేసిన అనంతరం పుష్ప యాగానికి సిద్ధం చేసిన , వివిధ రాష్ట్రాల నుండి సేకరించిన 27రకాల పుష్పాలు సుమారు రెండు వేల కిలోలను వేద పురాణ ప్రబంధ పారాయణం జరుగుతుండగా ఆచార్యులు తులసీదళములు మొదలు మిగిలిన పుష్పాలు అన్నిటినీ స్వామి పాదాలకు సమర్పిస్తారు.

ఈ క్రతువు వల్ల పూర్వ కార్తీక మాసంలో జరిగిన బ్రహ్మోత్సవం లోని దోషాల ఉపశమనతో పాటు చూసిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి.
ఓం నమో వేంకటేశాయ.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button