నిన్న జరిగిన పుష్పయాగం విశిష్టత
శ్రీవారికి జరిపిన పుష్ప యాగ విశేషాలు.
తిరుమలలో శ్రీవారికి ఏటా కార్తీక మాసంలో జరిగే అపురూపం అయిన ఉత్సవం పుష్ప యాగం.ఇది కార్తీక మాసం లో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేస్తారు.
ఈ క్రతువు శ్రవణ నక్షత్రం ఉన్న ముందు రోజు నుండే మొదలు అవుతుంది.కంకణ ధారులైన ఆచార్యులు మలయప్ప స్వామి వారిని నిత్య పూజల అనంతరం వేంచేపు చేసి పాలు, పెరుగు , తేనె , నెయ్యి , నారికేళ జలం , పసుపు , చందనం , కుంకుమ పూవు , వట్టి వేర్లు కలసిన సుగంధ పరిమళ జలాలతో అభిషేకం చేసిన అనంతరం పుష్ప యాగానికి సిద్ధం చేసిన , వివిధ రాష్ట్రాల నుండి సేకరించిన 27రకాల పుష్పాలు సుమారు రెండు వేల కిలోలను వేద పురాణ ప్రబంధ పారాయణం జరుగుతుండగా ఆచార్యులు తులసీదళములు మొదలు మిగిలిన పుష్పాలు అన్నిటినీ స్వామి పాదాలకు సమర్పిస్తారు.
ఈ క్రతువు వల్ల పూర్వ కార్తీక మాసంలో జరిగిన బ్రహ్మోత్సవం లోని దోషాల ఉపశమనతో పాటు చూసిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి.
ఓం నమో వేంకటేశాయ.