Tollywood news in telugu

విలన్ గా మారిన స్టార్ రైటర్

టాలీవుడ్ ప్రముఖ రచయిత అబ్బూరి రవి తెలుగు ప్రేక్షకులను తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో దశాబ్దంన్నరగా తనదైన ముద్ర వేస్తూ సాగిపోతున్నాడు రవి. హీరో సిద్ధార్ద్ కెరీర్ లోనే  బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయిన “బొమ్మరిల్లు” సినిమాకి డైలాగ్స్ రాసినది అబ్బూరి రవి.  వాటితో పాటు ‘పంజా, గూడాచారి’ వంటి సినిమాలకు డైలాగ్స్ ని అందించి మంచి డైలాగ్ రైటర్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘గూఢచారి’కి కూడా అతనే రచయిత. చాలా సినిమాలకు రచన అందించిన అబ్బూరి రవి తాజా సమాచారం ప్రకారం విలన్ రోల్ లో నటించేందుకు సిద్దమయ్యారని సమాచారం. ఆ సినిమా పేరు ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ‘వినాయకుడు’ ఫేమ్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో విలన్ పాత్రలో అబ్బూరి రవి నటిస్తున్నాడట. అబ్బూరి రవి ఈ చిత్రానికి రచనా సహకారం కూడా అందిస్తున్నాడు. అంటే టాలీవుడ్ కి మరో కొత్త విలన్ పరిచయo కాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోగా ఆది సాయికుమార్ నటించబోతున్నారు. ఇక ఇలా అబ్బూరి రవి తనలోని రైటర్ యాంగిల్ తో పాటు మరొక యాంగిల్ ని ప్రేక్షకులకు అందించబోతున్నారు.

డైరెక్టర్ సాయికిరణ్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో హిట్ ని అందుకోలేదు. ఇప్పుడు భిన్నమైన థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఎయిర్ టెల్ ప్రకటనలో నటించిన మోడల్ సాషా చెత్రి ఈ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కావడం మరో విశేషం. ‘కేరింత’ ఫేమ్ నూకరాజుతో పాటు కార్తీక్ రాజు, నిత్య నరేష్, మనోజ్ నందం, కృష్ణుడు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయికుమార్ తనయుడు ఆది మరో ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి హిట్ సినిమాలకి మ్యూజిక్ అందించిన శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button