Tollywood news in telugu

మంచి సందేశంతో వస్తున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రాన్ని ఆదరించండి.


క్షణికావేశలో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు….*

*మంచి సందేశంతో వస్తున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రాన్ని ఆదరించండి…*

*స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎల్ ఏ మేడా మల్లికార్జున రెడ్డిలు.*

ఈ నెల 27 న రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై విడుదల కానున్న స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి రాయచోటి లోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు.చిత్రబృందం పాల్గోన్న ఈ ప్రమోషన్స్ కు ఎపి ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే, టిటిడి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి లు ముఖ్యఅతిధులుగా హజరై ఏ వి ని లాంచ్ చేశారు. క్షణికావేశంలో విద్యార్థులు తీసుకోనే నిర్ణయాలు సరైనవి కావని ఓ చక్కటి సందేశంతో వస్తున్న ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్కరు ఆదరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డిలు కోరారు. పరీక్షల్లో ఫైయిల్ అయినంత మాత్రాన చావే శరణ్యం కాదని, విజయం ఓ అథిదిలాంటదని అలావచ్చి ఇలా వేళ్ళిపోతుందని. కానీ ఒటమి నిత్యం ప్రక్కనే వుండి ఓ పాఠాన్ని నేర్పుతుందనే సందేశం ఈ సినిమా ద్వారా ఇవ్వడం విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపుతుందని వారు చెప్పారు .రాయచోటి ప్రాంత వాసి నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి మంచి చిత్రాలను నిర్మిస్తున్నారన్నారని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి, మాజీ జెడ్ పి టి సి సుదర్శన్ రెడ్డి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు పోలు రెడ్డి సుబ్బారెడ్డి, దశరథ రామిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button