Today Telugu News Updates
ప్రియుడు మోసం చేయడంతో తన ఇంటికివెళ్లేందుకు మనసొప్పక ఆత్మహత్య !

ఇంతకుముందే ఒక పెళ్లి చేసుకొని పిల్లలని కన్న తరవాత, మరో వ్యక్తి పై మోజుపడి వెళ్లిపోయిన సంఘటన శ్రీకాళహస్తి లో జరిగింది.
ఎస్ ఐ వెల్లడించిన కథనం మేరకు శ్రీకాళహస్తి కి చెందిన సురేష్ అనే వ్యక్తికీ చెంచెమ్మ అనే కూతురు ఉంది. ఈమే వివాహం 7 ఏళ్ళ క్రితం పాపానాయుడు పేటకు చెందిన వ్యక్తితో పెళ్ళై పిల్లలుకూడా ఉన్నారు. కానీ చెంచెమ్మ అదే గ్రామినికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం తెలుసుకున్న తన భర్త, తల్లిదండులు ఎంతచెప్పినా మారకపోగా , కొంతకాలం క్రింద తను అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో వెళ్ళిపోయింది.
కానీ తీరా వెళ్ళాక కొన్నిరోజుల తర్వాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో చెంచలమ్మ అక్కడ ఉండలేక, తన పుట్టింటికి వెళ్లలేక ఆత్మహత్య చేసుకుంది అని ఎస్ ఐ వెల్లడించాడు.