Tollywood news in telugu
సామాజిక కార్యకర్తలకు హితవు
శబరిమల పైన అనవసర రాద్ధాంతం చేస్తున్న వారికి చురకలు అంటించిన రచయిత్రి.
సుప్రీం కోర్ట్ తీర్పు నేపధ్యంలో శబరిమల ఆలయం నిబంధనలకి విరుద్ధంగా కొంతమంది మహిళా సామాజిక కార్యకర్తలు దర్శనం దిశగా అలజడులు సృష్టిస్తూ ప్రజలను వ్యవస్థను అలజడి కి గురి చేస్తున్న నేపధ్యంలో ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇలా స్పందించారు.
దేశంలో మహిళలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయ్ అవన్ని వదిలి పెట్టి కేవలం శబరిమల ఆలయ దర్శనం కోసం పోరాడటం సరికాదని ఆవిడ అభిప్రాయ పడ్డారు.గృహ హింస , వేధింపులు, అత్యాచారం, ఆరోగ్యం, స్వేచ్ఛ లాంటివి ఎన్నో ఉండగ అవన్ని బదిలీ పెట్టి ఇలాంటివి ప్రోత్సహించడం తగదని తెలిపారు.