Tollywood news in telugu

Kathi mahesh:: శోకం తో పెట్టినా ట్వీట్ వివాదం లో మునిగితేలుతుంది..

Kathi mahesh:: మనందరికీ N.T.R గారు హోస్ట్ గా చేసిన షో బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గున్న కంటెస్టెంట్స్ లో కత్తి మహేష్ ఒకరు అని తెలుసు. అయన కామెడీ తో షో లో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు, కానీ షో అయ్యాక బయట హీరోలను , రాజకీయ నాయకులను టార్గెట్ చేసి ట్వీట్లు పెట్టడం వాళ్ళ అతని పైన నెగటివిటీ ఎంతగానో పెరిగిపోయింది. అది ఎంతవరకు చేరింది అంటే అతను బ్రతికి ఉండటం కంటే చనిపోయిన బాగుండు దరిద్రం వదిలిపోతుంది అని ట్రెండ్ చేసారు.

చివరికి అయన నెంబర్ కనుకొని కాల్స్ చేసి కూడా బెదిరించిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే రెండు వారాల క్రితం అయనకి యాక్సిడెంట్ అయినా విషయం అందరికి తెలిసిందే. అప్పటినుంచి సినీ ప్రముఖులు అయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు మరికొందరు నవ్వుకుంటున్నారు బాగయింది అని , కానీ అనుకోకుండా నిన్న రాత్రి అయన మరణించారు. అది చూసి బాధ తో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేసారు ” ఎన్నో జ్ఞాపకాలు మంచి స్నేహితుడిని కోల్పోయాను” అని దాని చూసి నెటిజన్లు అసలు అయన చేసిన ఒక మంచి చెప్పు అని వివాదాన్ని సృష్టిస్తున్నారు. ఏదైనా సగటు మనిషి చనిపోయాక సానుభూతి చూపించకపోయిన పర్లేదు కానీ శవం ముందర పెట్టుకొని బేరం ఆడినట్లు ఉంది నెటిజెన్ల కామెంట్లు చూస్తుంటే..

ఏదైతే అది కత్తి మహేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button